జీడిమెట్ల ఠాణా పరిధి చింతల్లో ఓ కుటుంబం ఇంట్లో వారం రోజులుగా మృతదేహంతో జీవిస్తోంది. తమ కుటుంబంలోని మహిళ (40) అనారోగ్యంతో వారం రోజుల క్రితం చనిపోయింది. అయితే ఏమనుకున్నారో తెలియదు కానీ, ఆమె శవానికి అంత్యక్రియలు చేయలేదు. పైగా వారం నుంచి శవాన్ని ఇంట్లో పెట్టుకునే ఉంటున్నారు. దాంతో శవం కుళ్లిపోయి పురుగులు పట్టింది. తీవ్ర దుర్వాసన వస్తుండడంతో పక్కింటివారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే కుటుంబీకుల మతిస్థిమితం సరిగ్గా లేకనే విషయం బయటకు రాలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: ట్రంప్కు షాకిచ్చిన కోర్టు.. ఎన్నికలకు ట్రంప్ అనర్షుడని ప్రకటన