వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం వర్ధన్నపేట మండలం ఇల్లందలో బుధవారం ఉదయం జరిగింది. రాజస్థాన్కు చెందిన లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండి, ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టినట్లు తెలిసింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డవారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆటోలోని వారంతా చెట్లపై తేనే తీసి అమ్ముకుంటూ కుటుంబాలను పోషిస్తూ.. జీవనం సాగిస్తారని సమాచారం.