హైదరాబాద్: కూకట్పల్లి విజయ నగర కాలనీలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనను ప్రేమించటం లేదని లీలా నాగజ్యోతి అనే యువతి పై రాజు అనే యువకుడు కత్తితో దాడి చేసాడు.
ఇది కూడా చదవండి: రెండు వేల నోట్లు 93 శాతం బ్యాంకులో డిపాజిట్ అయ్యాయి
ఈ దాడిలో మెడపై నాగ జ్యోతికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నాగజ్యోతి పై దాడి అనంతరం ఆ యువకుడు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: రష్యా లూనా-25 కూలిన చోట చంద్రుడిపై ఏర్పడిన భారీ గొయ్యి ..!!
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, బాధితురాలు ఓ ప్రైవేట్ స్కులులో టీచరుగా పని చేస్తుండగా.. నిందితుడు ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.