Sunday, May 19, 2024

ఫ్రెండ్ రూంకు వచ్చి సూసైడ్ చేసుకున్న లవర్స్

spot_img

లవర్స్ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన కూకట్‎పల్లిలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలంలోని గొల్లవానితిప్పకు చెందిన శ్యాం, జ్యోతిలు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా.. వీరిద్దరూ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‎లోని కేపీహెచ్‎బీలోని 7వ ఫేజులో ఉంటున్న స్నేహితుడి గదికి వచ్చారు. కొన్ని రోజులుగా ముగ్గురూ అక్కడే ఉంటున్నారు. అయితే ఆదివారం తెలిసిన వారి పెళ్లి ఉండటంతో స్నేహితుడు బయటకు వెళ్లాడు. పెళ్లి ముగించుకొని గదికి వచ్చిన చూసే సరికి.. శ్యాం, జ్యోతిలు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. దాంతో వారి స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను కిందికి దించి, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles