Tuesday, July 2, 2024

మరో అంతర్జాతీయ సంస్థకు సీఈఓగా భారతీయుడు

spot_img

అంతర్జాతీయ మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ నీల్సన్‌కు సీఈఓగా భారతీయుడు కార్తీక్‌ రావు నియమితులయ్యారు. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. మరో వైపు 2018 నుంచి సీఈఓగా ఉన్న డేవిడ్‌ కెన్నీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ప్రమోషన్ పొందారు. కార్తీక్‌ రావు సుదీర్ఘకాలంగా నీల్సన్‌లోని వివిధ విభాగాల్లో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ తదితర హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు.

చెన్నైలోని లయోలా యూనివర్సిటీలో ఎకనామిక్స్‌ చదివిన కార్తీక్‌రావు, అమెరికాలోని ఇలినాయిస్‌ స్టేట్‌ యూనివర్సిటీలో ఎంబీఎ పట్టా పొందారు. నీల్సన్‌ వరల్డ్ వైడ్ గా 55 కంటే ఎక్కువ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Latest News

More Articles