రంగారెడ్డి: మంచాల మండలంలోని భూములకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని విషయం.. ఎమ్మెల్యే పై అనుచిత ఆరోపణలు చేస్తే చూస్తూ సహించేది లేదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఈ భూములకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే మంచిరెడ్డి దృష్టికి తీసుకొస్తే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Drinks For Bloating: కడుపులో మంట లేస్తుందా? ఈ డ్రింక్స్ తాగండి..!!
ఎలాంటి అవగాహన లేకుండా కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో పర్యటించి తమ పార్టీపై..కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్దికోసమే ఈ ఆరోపణలు, మీడియాలో కనిపించేందుకే నాలుగు రోజుల పర్యటనలు అంటూ విమర్శించారు.కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా మంచిరెడ్డి కుటుంబానికి సంబంధం ఉందని అనడం సిగ్గు చేటన్నారు.
ఇది కూడా చదవండి: చెన్నూరు ఆరోగ్య కేంద్రానికి రూ.1.43 కోట్ల నిధులు మంజూరు
ఉమ్మడి రాష్ట్రంలో అవినీతిపరుల చిట్టాలో మొదటి స్థానంలో ఉన్న మల్ రెడ్డి రంగారెడ్డి తమ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించడమేనని ధ్వజమెత్తారు. గత పదిహేను సంవత్సరాలుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంను కేసీఆర్ ప్రభుత్వమే అభివృద్ధి చేసింది. మల్ రెడ్డి ఎన్నికల సమయంలో తప్పా ఎప్పుడు కనిపించడని, నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఆయన మతిస్థిమితం పోయిందని విమర్శించారు.