రంగారెడ్డి: మణికొండలోని జోల్లి కిడ్స్ ప్లే స్కూల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒకసారిగా మంటలు చెలరేగాయి. దీంతో టీచర్లు, చిన్నారులు భయంతో పరుగులు తీసారు. సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ కి చేరుకున్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.