Friday, May 17, 2024

15రోజుల్లో పెళ్లి..అంతలోనే ఓ యువతి సూసైడ్..!!

spot_img

ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్న యువతి 12వ తేదీని పెళ్లిచేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఇంతలోనే ఆదివారం తెల్లవారుజామున బలవన్మరణానికి పాల్పడింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…బీహార్ కు చెందిన అదితి భరద్వాజ్ కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి ఇక్కడే స్థిరపడింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆమె గతంలో ఓ వ్యక్తిని వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. మణికొండలో నివాసం ఉంటున్న ఆమె కొంతకాలంగా తనతో కలిసి పనిచేసే చింతల్ కు చెందిన మహ్మద్ అలీతో సహజీవనం చేస్తోంది.

ఇది కూడా చదవండి: నేడు ప్రధాని మోదీ పరీక్ష పే చర్చ కార్యక్రమం..!!

ఈ క్రమంలోనే అతను అత్తాపూర్ లో ఓ అపార్ట్ మెంట్లో ఫ్లాట్ ను అద్దెకు తీసుకుని అదితిని అందులో ఉంచాడు. వచ్చేనెల 12న ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే రెండు రోజులుగా ఆరోగ్యం బాగలేదని ఆసుపత్రికి వెళ్లిన అదితి గర్భం దాల్చినట్లు వైద్యులుచెప్పారు. అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న ఆమె ఆదివారం తెల్లవారుజామున మహ్మద్ అలీకి ఫోన్ చేసి తాను తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు చెప్పింది. అతను ఫ్లాట్ చేరుకునే లోపే ఫ్యాన్ కు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. అతను అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 

Latest News

More Articles