Tuesday, May 21, 2024

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం..ప్లాస్టిక్ గోడౌన్ మంటలు..!!

spot_img

హైదరాబాద్ లోని మైలార్ దేవ్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక టాటానగర్ లోని ఓ ప్లాస్టిక్ గోడౌన్ లో రాత్రి ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగరావడంతో స్థానికులకు ఊపిరాడని పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది…వచ్చే సరికే మంటలు భారీగా చెలరేగాయి. వాటిని అదుపు చేయడానికి దాదాపు 4గంటల సమయం పట్టింది. మంటల్లో ప్రాణనష్టం జరగనట్లు సమాచారం. ఆస్తి నష్టం మాత్రం భారీగా ఉంటుందని చెబుతున్నారు. మంటలు ఎలా చెలరేగాయన్నదానిపై రకరకాల అనుమానాలు ఉన్నాయి. అధికారులు కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. స్థానికులు మాత్రం ఈ గోడౌన్ ను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: శీతాకాలంలో గుండెపోటు బారినపడకూడదంటే…ఈ జాగ్రత్తలు తీసుకోండి.

Latest News

More Articles