మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టడం తో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాలకు పైగా పెండింగ్ లో ఉన్న బిల్లు ప్రవేశపెట్టడం తో సంతోషంగా ఉందని మేయర్ అన్నారు. ఈ బిల్లుతో మహిళలు కూడా రాజకీయ రంగంలో ముందు ఉంటారని, దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్రను పోషిస్తారని, మహిళా సాధికారిక సాధ్యమవుతుందని అన్నారు.
మహిళా బిల్లు ఆమోదం పొందటం దేశానికే గర్వకారణం అని తెలిపారు. ఈ బిల్లుకు నారి శక్తి అని నామకరణం చేయటం సంతోషమని మహిళలందరూ తరఫున కృతజ్ఞతలు తెలియ జేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టడంలో MLC శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి కృషి ఎంతో ఉందని మహిళల తరపున ఎమ్మెల్సీ కవిత గారిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.