తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. రేపు(ఆదివారం) జరగనున్న గ్రూప్ 1 పరీక్ష కోసం 897 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. పరీక్ష నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యం కోసం ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అభ్యర్థులకు రేపు(ఆదివారం) రవాణాపరంగా అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రాష్ట్రంలోని 897 పరీక్షా కేంద్రాలకు బస్సులను నడపాలని క్షేత్రస్థాయి ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే సంస్థ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసినట్లు సజ్జనార్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి:రేపే గ్రూప్-1 ప్రిలిమ్స్: నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు