దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TS RTC) ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సొంతూళ్లకు వెళ్లే వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు TS RTC అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 13 నుంచి 25 వరకు 5,265 ప్రత్యేక బస్సులను నడపనున్నది. ఈ బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది.
22న సద్దుల బతుకమ్మ, 23న మహార్ణవమి, 24న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని ప్రత్యేక బస్సులను నడపనుంది ఆర్టీసీ. గత దసరా కంటే ఈసారి దాదాపు 1,000 (20 శాతం) బస్సులను అదనంగా నడుపుతున్నట్టు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
ఇది కూడా చదవండి: ఘోరరోడ్డు ప్రమాదం..ట్రక్కుబోల్తా…10 మంది మృతి..!!