Sunday, April 28, 2024

ఎన్నికల టికెట్ ఇస్తానంటూ రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయలు తీసున్నాడు

spot_img

రాష్ట్రంలోని 119 స్థానాల్లో కాంగ్రెస్‌ టికెట్ల కోసం రేవంత్ రెడ్డి వందల కోట్లు తీసుకొని ఆయన అనుయాయులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి. అది నిజం కాకపోతే చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఏ తప్పూ చేయలేదని ప్రమాణం చేయాలని డిమాండ్‌ చేశారు.రేవంత్ రెడ్డి ..కసిరెడ్డి నారాయణ రెడ్డి దగ్గర 6 కోట్లు, గాలి అనిల్ కుమార్ దగ్గర 12 కోట్ల రూపాయలు తీసుకున్నాడన్నారు. నేను చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించాలంటే భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు కొత్త మనోహర్ రెడ్డి.

నేను సీఎం అవుతా నీకు రెవెన్యూ మంత్రి ఇస్తా అని గాలి అనిల్ కుమార్ దగ్గర 12 కోట్లు తీసుకున్నాడన్నారు. రేవంత్ ఇలా చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నాడని తెలిపారు. ఆ చిట్టా అంతా ఈడీకి, సీబీఐకి ఇచ్చి కంప్లైంట్ చేస్తానని అన్నారు మనోహర్ రెడ్డి. రేవంత్ ఏమీ సొక్కమైన వ్యక్తి కాదు గతంలో ఓటుకు నోటు కేసులో 50 లక్షలు ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి అని అన్నారు. ఆయనకు ఇదేమి కొత్తకాదన్నారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే సర్వేలో చూపిస్తూ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేస్తున్నాడని విమర్శించారు.

ఇటీవల మహేశ్వరం టికెట్ కోసం చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి దగ్గర 10 కోట్లు, 5 ఎకరాల భూమిని కొత్త మనోహర్ రెడ్డి తీసుకున్నాడని ఆరోపణలు చేయగా.. కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు రేవంత్ రెడ్డి.

ఇది కూడా చదవండి:దసరాకు 5,265 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. అదనపు చార్జీలు లేవు

Latest News

More Articles