అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ లియోనల్ మెస్సీ.. ఖతార్ గడ్డపై అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపి తన వరల్డ్ కప్ కలను నిజం చేసుకున్నాడు. ఈ మధ్యే ఎనిమిదోసారి ‘బాలన్ డీ ఓర్’ అవార్డు అందుకున్నాడు. తాజాగా అభిమానులకు గుడ్న్యూస్ చెప్పాడు.
Also Read.. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ జోరు
2022 వరల్డ్ కప్లో తాను ధరించిన 10 వ నంబర్ జెర్సీలను వేలం వేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నపిల్లల చికిత్స కోసం విరాళంగా ఇవ్వనున్నట్టు మెస్సీ తెలిపారు.
Also Read.. కాంగ్రెస్లో డజను మంది ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారు
ఫ్రాన్స్తో జరిగిన ఫైనల్లో ధరించిన జెర్సీతో కలిపి మొత్తం ఆరు జెర్సీలకు రూ. 76 కోట్ల కనీస ధర నిర్ణయించారు. వేలం ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని సాంట్ జాన్ డె డూ బార్సెలోనా పిల్లల దవాఖాన నిర్వహిస్తున్న యునికాస్ ప్రాజెక్ట్ కు మెస్సీ డొనేట్ చేయనున్నాడు.