ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విపక్షా ప్రధాని అభ్యర్థి రేసులో లేరని ఆ రాష్ట్ర మంత్రి అతిషి స్పష్టం చేశారు. భారత దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఆప్ ఇండియా కూటమిలో చేరినట్లు చెప్పారు. కేజ్రీవాల్ ప్రతిపక్షాల కూటమిలో ప్రధాని రేసులో ఉన్నారని ఇటీవల ఆప్ నేత ప్రియాంక తెలిపారు. అయితే అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని లేటెస్టుగా మంత్రి అతిషి తెలిపారు.