Saturday, May 18, 2024

సీఎం కేసీఆర్ మనకు శ్రీరామరక్ష.. మరోసారి గెలిపించాల్సిన బాధ్యత మనదే

spot_img

జనగామ జిల్లా: దేవరుప్పుల మండలం 10 గ్రామాలకు కోలుకొండ, 12 గ్రామాలకు సింగరాజు పల్లిలలో గ్రామాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన కోసం నెల కష్ట పడాలని, 5 ఏళ్లు సేవ చేస్తానని తెలిపారు. ప్రజా సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యం అన్నారు. దేవరుప్పుల మండలం 10 గ్రామాలకు కోలుకొండ, 12 గ్రామాలకు సింగరాజు పల్లిలలో గ్రామాల వారీగా సమీక్ష సమావేశాలను మంత్రి ఎర్రబెల్లి నిర్వహించారు.

Also Read.. ప్ర‌ధాని మోదీ పిచ్చిపై.. ‘ఒక్క ఛాన్స్’ కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ సెటైర్లు

ఈ సందర్భంగా కార్యకర్తల బాగోగులు తెలుసుకున్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. గత ఐదేళ్లలో మంత్రిగా నియోజకవర్గాన్ని అద్దంలా తీర్చిదిద్దినట్టు తెలిపారు. ఇంకొన్ని పనులు మిగిలి వున్నాయని, ఎన్నికలు అయ్యాక మన ప్రభుత్వం వచ్చాక ఆ పనులను పూర్తి చేసి, తనకు ఓటేసిన ప్రజల రుణం తీర్చుకుంటాను అని అన్నారు. సీఎం కెసిఆర్ మనకు శ్రీ రామ రక్షా అని, వారిని మరోసారి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద వుందన్నారు.

Latest News

More Articles