Saturday, May 4, 2024

60 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో గొల్లకుర్మలకు తీవ్ర అన్యాయం

spot_img

పాలకుర్తి: కాంగ్రెసోల్లు దొంగలని, వారు పాలించే రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తిలో గొల్లకుర్మల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు.

Also Read.. బీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన సారథి సీఎం కేసీఆర్‌ అని అన్నారు. ఓటు అనే వజ్రాయుధాన్ని ఆలోచించి వేయాలన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో గొల్లకుర్మలకు తీవ్ర అన్యాయం జరిగింది.

Also Read.. శుభ్‌మాన్ గిల్ ఫోర్ కొట్టగానే..సారా టెండూల్కర్ ఏం చేసిందో తెలుసా? వైరల్ వీడియో

గొల్ల కుర్మలకు అండగా నిలిచింది సీఎం కేసీఆర్‌. గొర్రెల యూనిట్లను అత్యధికంగా పాలకుర్తిలో పంపిణీ చేశాము. మూడు పంటలు కావాల్నా…మూడు గంటల కరెంట్‌ కావాలనో ప్రజలు తేల్చుకోవాలి.  రేవంత్‌ రెడ్డి 10హెచ్‌పీ మోటర్‌ పెట్టి మూడు గంటల కరెంట్‌ ఇస్తా అని మాట్లాడడం సిగ్గుచేటు అని అన్నారు.

Latest News

More Articles