Friday, May 17, 2024

రైతులను రాజులుగా చేయలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యం

spot_img

రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సీఎం కేసీఆర్ హయాంలో బంగారు తెలంగాణ అవుతుందన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గుడికుంట తండాలో తండా బాట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు మంత్రి ఎర్రబెల్లి.. ఎన్నికలప్పుడు వచ్చే కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మవద్దు. తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు సౌభాగ్య లక్ష్మీ పథకంతో రూ. 3 వేలు ఇవ్వబోతున్నాము. రూ. 400లకు గ్యాస్ ఇవ్వబోతున్నామని తెలిపారు.

వచ్చే నెల నుండి సన్నబియ్యం అందజేయబోతున్నామని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వికలాంగులకు ఆరువేల పెన్షన్ ఇవ్వబోతున్నామన్నారు. ఆసరా పెన్షన్లు.. రెండు వేల నుండి.. నాలుగు వేలు ఇవ్వబోతున్నామన్న మంత్రి ఎర్రబెల్లి..మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అని అన్నారు. రైతులను రాజులుగా చేయలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కళ్యాణాలక్ష్మి, రైతు బంధు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

ఇది కూడా చదవండి: తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతుల్లో పెట్టకండి

Latest News

More Articles