Monday, May 20, 2024

మరో భద్రాద్రిగా వాల్మిడి కట్టడాలు.. సీఎం కేసీఆర్ ఫోకస్

spot_img

జనగామ జిల్లాలో వచ్చే నెల 4న సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా పాలకుర్తి మండలం వాల్మీడి గ్రామంలోని సీతారాముల దేవస్థానంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొని జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సమావేశంలో కలెక్టర్ శివలింగయ్య, ఆడిషినల్ కలెక్టర్ రోహిత్ శర్మ, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ‘వచ్చే నెల 4న వాల్మీడికి రానున్నారు సీఎం కేసీఆర్. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు పాలకుర్తి వాల్మీడిలో శ్రీ సీతారాముల కల్యాణానికి మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ లతో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పాలకుర్తిలో 25 కోట్లతో హరిత హోటల్ కు శంకుస్థాపన చేయనున్నారు సీఎం కేసీఆర్. ఇక అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని.. వాల్మీడి కట్టడాలు మరో భద్రాద్రిని తలపిస్తున్నాయని.. సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

Latest News

More Articles