Friday, May 3, 2024

కేసీఆర్ లేని తెలంగాణ అంటే నెర్రలు వారిన తెలంగాణనే

spot_img

బీఆర్ఎస్ పార్టీనే తమ భవిష్యత్తు అని ప్రజలు నమ్ముతున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఒకప్పుడు వ్యవసాయానికి పనికిరాని భూములు ఇప్పుడు కాళేశ్వరం నీటితో కలకలాడుతున్నాయన్నారు. కరువు నుంచి‌ అద్భుతమైన పంటలు పండే రోజులు వచ్చాయని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన కరీంనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘ఆంధ్రావాళ్ళు కాంగ్రెస్, బీజేపీ ముసుగుతో వచ్చి తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలపాలని చూస్తున్నారు. రేపు అధికారం ఢిల్లీ చేతిలో కాదు, కేసీఆర్ చేతిలో పెట్టాలి. తెలంగాణ యువత భవిష్యత్తు కేసీఆర్ మాత్రమే ‌కాపాడుతారు. యువత భవిష్యత్తు బాగుండాలంటే కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలి. మూడుసార్లు గెలిపించారు, నాలగవసారి మరోక అవకాశం ఇవ్వండి‌, ఇంకా అభివృద్ధి చేస్తాను. మానేరు రివర్ ఫ్రంట్ వస్తే ఇంకా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ పాలనలో వలసలు తగ్గిపోయాయి. ఆంధ్రా ముసుగులో లీడర్లు వస్తున్నారు, నమ్మవద్దు. యువత భవిష్యత్తు బాగుండాలంటే కేసీఆర్ రావాలి. కాంగ్రెస్, బీజేపీ పాలకులు తెలంగాణను ఆంధ్రాలో కలుపుతారు. కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందాలంటే మరొక అవకాశం ‌ఇవ్వండి. డబుల్ ఇంజన్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్, కరీంనగర్‎లో ఎమ్మెల్యే గంగుల ఉండాలి. పదమూడు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది.

Read Also: ముగ్గురు బాలికలపై 65 ఏండ్ల వృద్ధుడి లైంగిక దాడి

కేసీఆర్ లేని తెలంగాణని ఊహించుకొనే పరిస్థితి లేదు. కేసీఆర్ లేని తెలంగాణ అంటే నెర్రలు వారిన తెలంగాణనే. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నవారికి ఓటు వేయవద్దు. భూ కబ్జా దారుల చేతుల్లోకి, మతతత్వ పార్టీ చేతుల్లోకి అధికారం పోవద్దు. ఈ నెల 18 నుంచి అందరం రంగంలోకి దిగుతాం. మంత్రి కేటీఆర్ 18న కరీంనగర్ రానున్నాడు, ఆ సందర్భంగా సభ ఉంటుంది. ఎన్నికలప్పుడు వచ్చిన వారిని నమ్మవద్దు. కేసీఆర్‎కు భయపడే ఈటల రాజేందర్ హుజురాబాద్‎లోనూ పొటీ చేస్తాను అంటున్నారు. బీజేపీలో తన ఆధిపత్యం కొరకే ఈటల రాజేందర్ ఇలా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ బీఫాంలు బీజేపీ ఆఫీసులో.. బీజేపీ బీఫాంలు కాంగ్రెస్ ఆఫీసులో తయారు అవుతాయి.

Read Also: ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ టీచర్

హైదరాబాదు సంపద కొల్లగొట్టడానికే ఆంధ్రా నాయకులు వస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ గురించి ఎందుకు? అటూ ఇటూ అయితే తెలంగాణ ఎత్తుకుపొవడానికి చూస్తున్నారు. బండి‌ సంజయ్ చేసిన గంజాయి ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గంజాయిని ఎవరైనా ప్రోత్సహిస్తారా? కరీంనగర్ గంజాయి రహితంగా ఉండాలని సీపీకి ఇంతకు ముందే చెప్పాం. 2019లో మాకు పేపర్లో యాడ్స్‎కి‌ కూడా అవకాశం ఇవ్వలేదు. అప్పుడు ‌కూడా సర్వేలు కాంగ్రెస్‎కే అధికారం వస్తుందన్నారు, కానీ మేమే అధికారంలోకి వచ్చాం. సర్వేలన్నీ మాకే అనుకూలంగా ఉన్నాయి. కర్నాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. పరిపాలనలో విఫలం అయ్యింది. కర్నాటకలో పథకాలు అమలు చెయడానికి ఇబ్బందులు పడుతున్నారు.. అటువంటి వారు ఇక్కడ ఆరు గ్యారంటీలు ఇస్తున్నారు. బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం ‌లేదు… మరి అటువంటప్పుడు ఈటల సీఎం ఎలా అవుతాడు? అని మంత్రి గంగుల ప్రశ్నించాడు.

Read Also: సీఎం కేసీఆర్ చేసిన పనులు.. బీజేపీ 100 జన్మలెత్తినా చేయలేదు

Latest News

More Articles