Sunday, May 19, 2024

షర్మిల, కేవీపీ, కిరణ్ కుమార్ రెడ్డిలపై విరుచుకుపడ్డ మంత్రి గంగుల

spot_img

కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో మహిళా సంఘం భవనానికి భూమి పూజ చేశారు మంత్రి గంగుల కమలాకర్. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన పలువురు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. షర్మిల, కేవీపీ, కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణపై పిల్లిలాగా నాచు పెట్టుకుని కూచున్నరు. బీఆర్ఎస్ రాకపోతే మళ్లీ తెలంగాణను ఆంధ్రాలో కలుపుతారు. కరీంనగర్ చరిత్రలో ఒక్క సారి గెలిచిన ఎమ్మెల్యే మళ్లీ గెలవలేదు. బీసీ బిడ్డగా మీ గ్రామాల కు వచ్చాను.

నన్నుమూడు సార్లు గెలిపించారు. మూడు సార్లు గెలిపించిన మీకు రుణపడి ఉంటా. శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ప్రతి ఊర్లకు రోడ్డు వేసాను, మంచి‌నీళ్లు ఇచ్చాను. ఎన్నికలు రాగానే దొంగలంతా మళ్లీ మోపయితున్నరు. ఢిల్లీ పాలకులు మనకొద్దు. హైదరాబాదు లో ఉండే కేసీఆర్ కావాలి. దొంగలొస్తున్నారు జాగ్రత్త. ఇరవై, ముప్పై కేసులు ఉన్నోళ్లు కాంగ్రెస్ టికెట్ కోసం అప్లై చేసుకున్నరు. టికెట్ కోసం ఐదు కోట్లు, పది కోట్లు పెడుతున్నరు. ఢిల్లీ పాలకులు వస్తే కరెంట్ ఎత్తుకపోతరు.. బొగ్గు ఎత్తుకపోతరు. దొంగలకు సద్దులు కట్టొద్దు’ అని అన్నారు గంగుల.

Latest News

More Articles