Saturday, May 18, 2024

రాజకీయ పబ్బం గడుపుకునేందుకే తనపై ఆరోపణలు

spot_img

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్‌ గ్రంథాలయంలో మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై కూడా అసత్యపు ఆరోపణలు చేసినా నాయకులు నేడు బీసీలకు అందించే లక్షా ఆర్థిక సహాయంపై కూడా అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

తెలంగాణ వద్దు అన్న పార్టీలు కూడా ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాయని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఓట్లకోసం గ్రామాల వెంట పడుతున్నారని విమర్శించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విలువ మున్సిపల్ ఎన్నికల్లోనే బయట పడ్డదని, కనీసం ఒక్క కార్పొరేటర్‌ను కూడా గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈడీ, సీబీఐ(CBI), ఐటీ వంటి సంస్థలు తన మీద విచారణ చేసినా ఏమీ తేలలేదని అన్నారు. ఎన్నికల్లో ఎంఐఎం మాత్రమే కాదు కేఏ పాల్, షర్మిల కూడా పోటీ చేయొచ్చని అన్నారు. తన జోలికి వస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

Latest News

More Articles