Sunday, May 19, 2024

సీఎం కేసీఆర్ ఏదైనా చెబితే తప్పకుండా చేసి చూపెడతారు

spot_img

మెదక్: సీఎం కేసీఆర్ ఏదైనా చెబితే తప్పకుండా చేసి చూపెడతారని, నమ్మకానికి ఆయన మారుపేరు ఆయనని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీశ్ రావు కొనియాడారు. బుధవారం మెదక్‌ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అమ్మకానికి మారుపేరు ప్రతిపక్షాలని, ప్రతి పక్షాలు సీట్లు అమ్ముకుంటారని అవసరమైతే అన్ని అమ్ముకుంటారని విరుచుకుపడ్డారు.

‘‘మెదక్‌ జిల్లా కావాలి అనేది దశాబ్దాల కల. గతంలో ఇందిరా గాంధీ మాట ఇచ్చి తప్పారు. నేడు కేసీఆర్ జిల్లా చేసి చూపించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి తిట్ల పురాణం. విపక్షాలు తిట్లలో పోటీ పడితే.. మేం పంట పండించే పనిలో బిజీగా ఉన్నాం. సమైక్య పాలనలో అన్నం తినడానికి లేని పరిస్థితి ఉంటే నేడు ఇతర రాష్ట్రాలకు అన్నం పెట్టే స్థాయికి ఎదిగాము.

బక్క పలుచని కేసీఆర్ తో తెలంగాణ వాస్తదా అని ఎగతాళి చేసిన నాయకులకు కేసీఆర్‌ తెలంగాణ తెచ్చి చూపించారు.  మెదక్ కు కాళేశ్వరం నీళ్లు తెస్తానని చెబితే అనుమానపు మాటలు మాట్లాడిన వారికి కాళేశ్వరం పూర్తి చేసి ప్రతి పక్షాల నోరు మూయించాడు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 కి 10 సీట్లు గెలిచి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దాము. ఆ దిశగా అందరూ కలిసి పనిచేయాలి.’’ అని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.

Latest News

More Articles