Saturday, May 18, 2024

బండి సంజయ్ బండి ఇవ్వడు.. కాంగ్రెస్ డిక్లరేషన్ అమలు చేయదు..!

spot_img

కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ పై మంత్రి హరీష్ రావు స్పందించారు. కాంగ్రెస్ వాళ్ళు డిక్లరేషన్ మీద డిక్లరేషన్ చేస్తున్నారు.AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో మొదట డిక్లరేషన్ చేయాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో వెయ్యి రూపాయల పింఛన్ మత్రమే ఇస్తున్నారు.

తెలంగాణలో మాత్రం అంత ఇస్తాం ఇంత ఇస్తాం అని నోటికి ఏదోస్తే అదే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ల నోటికి మొక్కాలి. వాళ్ళు తెలంగాణలో వచ్చేది లేదు సచ్చేది లేదు. బండి సంజయ్ కూడా GHMC ఎన్నికల్లో బండి పోతే బండి ఇస్తాం అన్నారు. ఇప్పటికి బండి లేదు..గుండు లేదు.

Latest News

More Articles