Friday, May 3, 2024

కేసీఆర్ తలచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైల్లో వేయకపోయుండేవాడా?

spot_img

కేసీఆర్‎కి పనితనం తప్ప పగతనం లేదని.. కేసీఆర్ తలచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైల్లో వేయకపోయుండేవాడా? అని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ పట్టణంలో నిర్వహించిన ఆలయ్-బలయ్ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.

Read Also: పుట్టిన గంటకే నలుగురు కవలలు మృతి.. బోరుమంటున్న తల్లిదండ్రులు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలపై మంత్రి ఫైర్ అయ్యారు. ‘కుర్చీల కోసం పదవులు మారే వ్యక్తి రేవంత్ రెడ్డి. గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు వాళ్ళ నాన్న చనిపోతే అంత్యక్రియలు చేశాక స్నానం చేయడానికి కరెంట్ లేదని అసెంబ్లీలో చెప్పారు. ఆనాడు సోనియా గాంధీని బలి దేవత, ఇటలీ బొమ్మ అని నోటికి ఏదోస్తే అదే తిట్టిండు. ఇప్పుడు సోనియాగాంధీ దేవత అంటున్నాడు.. రేవంత్ నోటికి మొక్కాలి. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ వచ్చి నేను బీజేపీతో పోరాడుతా, బీజేపీపై పోరాడే డీఎన్ఏ నాది అన్నారు. మరి రేవంత్ రెడ్డి డీఎన్ఏ ఏదో రాహుల్ తెలుసుకోవాలి. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి డీఎన్ఏలు మ్యాచ్ కావట్లేదు. మేం ఎవ్వరికీ బీ టీం కాదు.. మేం తెలంగాణ ప్రజల టీం. బీఆర్ఎస్, బీజేపీలు ఎప్పటికి ఒకటి కావు. నీళ్లు, నూనె ఎప్పుడైనా కలుస్తాయా.. ఇది కూడా అంతే. కేసీఆర్‎కి పనితనం తప్ప పగతనం లేదు. కేసీఆర్ తలుచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైల్లో వేయకపోవునా..? పక్క రాష్టాల్లో చూస్తున్నాం.. వాళ్ళు గెలవగానే వీళ్ళను.. వీళ్ళు గెలవగానే వాళ్ళని జైలుకి పంపిస్తారు’ అని మంత్రి హరీష్ రావు అన్నారు.

Latest News

More Articles