Sunday, June 16, 2024

పది రాష్ట్రాలకు అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ

spot_img

నిమ్స్‌ ఆస్పత్రిలో ఇంటిగ్రేటెడ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి హరీష్ ఈ సారి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పారు. వైద్య ఆరోగ్య రంగాన్ని సీఎం కేసీఆర్‌ బలోపేతం చేస్తున్నారని, పల్లె పట్టణ ప్రగతిలో అన్ని జాతీయ అవార్డులు తెలంగాణకే వస్తున్నాయని మంత్రి చెప్పారు. ఎంబీబీఎస్‌ సీట్లలో దేశంలో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందన్నారు.

ఇక పది రాష్ట్రాలకు అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని, అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని, కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏ విషయంలో తెలంగాణతో పోటీయో చెప్పాలని మంత్రి హరీశ్‌ అన్నారు. ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల తయారీలో నంబర్‌ వన్‌గా తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. ప్రత్యామ్నాయ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఇంటిగ్రేటెడ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌తో నిమ్స్‌లో ఒకేచోట ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, హోమియోపతి సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు హరీష్ రావు.

Latest News

More Articles