Saturday, May 18, 2024

బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ ఖాయం

spot_img

సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ లోని కార్యకర్తల మీద నమ్మకంతో సీఎం కేసీఆర్ హుస్నాబాద్ లో మొదటి ఎన్నికల సభ పెడుతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ లతో కలిసి హుస్నాబాద్ లో నిర్వహించిన బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..  ఎవరు అవునన్నా కాదన్నా మూడోసారి బిఆర్ఎస్ విజయం ఖయమన్నారు.  ఆసత్య సర్వేల పేరిట అధిరంలోకి వస్తామని కాంగ్రెసోల్లు గోబల్స్ ప్రచారం చేస్తున్నారని, కనీసం టికెట్లు కూడా ఇచ్చుకోలేని దయనీయ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు.  కాంగ్రెసోల్లు ఢిల్లీలో ఎక్కువ, గల్లీలో తక్కువ అని సెటైర్లు వేశారు.

Also Read.. టీఎస్ఆర్టీసీ దసరా ధమాకా: బస్సెక్కితే బహుమతులు

హుస్నాబాద్ ప్రాంతంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా కాంగ్రెస్, బిజెపి వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్నాబాద్ ఇచ్చిన గొప్ప వరం అన్నారు. ఈ నెల 15న బిఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుందని తెలిపారు.   2004లో తెలంగాణ ఇస్తామని టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ తర్వాత తెలంగాణ ఇవ్వకుండా టిఆర్ఎస్ పార్టీని మింగేయాలని చూసిందని పేర్కొన్నారు.

మూడు గంటలు, మీటర్లు పెడతామంటున్న కాంగ్రెస్, బిజెపి వాళ్ళు మంచివాళ్ళా? 24  గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంచోడా రైతులు ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ సంస్కృతి ముఠాల సంస్కృతి, టికెట్ల కోసం కుస్తీలు పట్టుకుంటున్నారు.  తెలంగాణ పథకాలను దేశం మొత్తం అమలు చేస్తున్నారు. ఒకప్పుడు తిండి లేని తెలంగాణ ఈ రోజు దక్షిణ భారత దేశ ధాన్య బండాగారంగా మారిందన్నారు.

Also Read… కాంగ్రెస్ కు అధికారమిస్తే తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది

వరి ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ అయింది.  కైలాసంలో పెద్ద పాము మింగినట్టు తప్పిపోయి కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పడితే తెలంగాణ కింద పడుతుంది. ఈనెల 15న హుస్నాబాద్ లో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు 3 గంటలకు ప్రజలను తీసుకువస్తే, 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారని మంత్రి హరీష్ రావు తెలిపారు.

Latest News

More Articles