Friday, May 17, 2024

సిద్ధిపేట వెంకటేశ్వరస్వామికి బంగారు కిరీటం సమర్పించిన మంత్రి హరీశ్ రావు

spot_img

ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సిద్ధిపేట వెంకటేశ్వరస్వామికి బంగారు కిరీటం సమర్పించారు మంత్రి హరీశ్ రావు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఇవాళ(సోమవారం) మంత్రి హరీష్ రావు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకొని, స్వామివారికి స్వర్ణ కిరీటం సమర్పించారు. తర్వాత వెంకటేశ్వరునికి ప్రత్యేకపూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కిరీటం తయారీలో ఆలయ వర్గాలతో పాటు హరీశ్ రావు కూడా పాలుపంచుకున్నారు.

స్వర్ణ కిరీటం బరువు 1.792 కిలోలు కాగా, ఇందులో కిలో బంగారం ఆలయ వర్గాలు కొనుగోలు చేయగా, మిగిలిన బంగారం హరీశ్ రావు తదితర దాతలు సమకూర్చారు. ఈ పసిడి కిరీటం విలువ కోటి రూపాయలకు పైనే ఉంటుందని అంచనా.

Latest News

More Articles