Tuesday, May 21, 2024

సీఎం అయినా కేసీఆర్ వ్యవసాయం చేస్తున్నారు

spot_img

కేసీఆర్ సీఎం అయినప్పటికీ వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు మంత్రి హరీష్ రావు.ఇవాళ(మంగళవారం) సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన ఆయన..దశాబ్దం క్రితం తెలంగాణలో కరువు తాండవించిందని, కానీ ఇప్పుడు 10 రాష్ట్రాలకు మన రాష్ట్రం అన్నం పెడుతోందన్నారు. సిద్దిపేటకు గోదావరి నీళ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ దన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రైతుబిడ్డ కాబట్టి కేసీఆర్ వ్యవసాయం చేస్తున్నారన్నారని తెలిపారు..

రైతుల్లో సీఎం కేసీఆర్ ధైర్యం నింపారన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణలో వేసవికాలం కూడా వర్షాకాలం మాదిరి కనిపిస్తోందన్నారు. ఎండాకాలంలోనూ చెరువులు జలకళతో కనిపిస్తున్నాయని చెప్పారు. సిద్దిపేటలో కరువు అనే పదాన్ని శాశ్వతంగా తొలగించామన్న మంత్రి హరీష్ రావు… సిద్దిపేట రైలు మార్గాన్ని వేగంగా పూర్తి చేశామన్నారు.

ఇది కూడా చదవండి: నేను బతికి ఉన్నంతకాలం దళిత బంధు ఆగదు

Latest News

More Articles