Monday, May 20, 2024

మాతృ ముర్తులందరికి మదర్స్‌ డే శుభాకాంక్షలు

spot_img

ప్రపంచంలో తల్లిని మించిన యోధులు మరెవరూ లేరన్న మంత్రి హరీశ్ రావు.. మాతృ ముర్తులందరికి మదర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన ఆయన.. అలాంటి తల్లిని సంరక్షించుకునేందుకు సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు తెలంగాణ  ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంద‌న్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 28 మాతా శిశు సంరక్షణ కేంద్రాలు..ఇవన్నీ తల్లులు, ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన రక్షణ వలయమని చెప్పారు మంత్రి హరీశ్ రావు. అందుకే మాతృ మరణాలు తగ్గించడంలో దేశంలోనే మనం మూడో స్థానంలో నిలిచామన్నారు. 2014లో 92 ఉండగా, ప్రస్తుతానికి 43కు తగ్గింది. ఇది తల్లులు, ఆడ బిడ్డల సంరక్షణ పట్ల కేసీఆర్ గారికి ఉన్న ప్రేమ, చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

దేవుడు అన్ని వేళలా.. అన్ని చోట్ల అందుబాటులో ఉండలేడు కాబట్టి.. ఆ దేవుడే అమ్మను సృష్టించాడు, ప్రతి ఒక్కరికీ అమ్మను అందించాడు అంటారు. అది వాస్తవం కూడా. అలాంటి అమ్మల ఆరోగ్యాన్ని కాపాడటం అందరి బాధ్యత. అనవసర కడుపు కోతలు తగ్గాలి, తల్లుల గోస తీరాలి అనే నినాదంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నానని తెలిపారు మంత్రి హరీశ్ రావు.

Latest News

More Articles