ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ భద్రాచలం సీతారాముల ఆలయానికి రూ.10 లక్షల భారీ విరాళం అందించారు. ప్రభాస్ ప్రతినిధులు నిన్న(శనివారం) ఆలయ ఈవో రమాదేవికి చెక్కును ఇచ్చారు. ఈ డబ్బును అన్నదానం, గోశాల విస్తరణ, ఆలయ అవసరాల నిమిత్తం కేటాయించినట్లు ఏఈవో భవాని రామకృష్ణారావు చెప్పారు.
రామాయణం ఇతివృత్తంతో ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా హిట్ కావాలని.. ప్రధానాలయంలో మూలవిరాట్కు ప్రత్యేక పూజలు చేశారు.