రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్-16 మ్యాచ్ లో 112 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది బెంగళూరు. రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. 172 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ 10.3 ఓవర్లలో 59 పరుగులకే ఆలౌటైంది. బెంగళూరు బౌలర్లలో పార్నెల్-3 పడగొట్టాడు. బ్రాస్వెల్, కర్ణ్ శర్మ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. సిరాజ్, మ్యాక్స్ వెల్ చెరో వికెట్ పడగొట్టారు.
మెదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ బ్యాటర్లలో డుప్లెసిస్ (55), మ్యాక్స్ వెల్ (54) ఆఫ్ సెంచరీలు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో ఆసిఫ్, ఆడమ్ జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా, సందీప్ శర్మ ఒక వికెట్ తీశారు.