Monday, May 13, 2024

కాంగ్రెస్ మెనిపెస్టోను ప్ర‌జ‌లు నమ్మ‌రు

spot_img

ఎన్నిక‌లు ముగియ‌క ముందే కాంగ్రెస్ నాయ‌కులు ప‌గ‌టి క‌ల‌లు కంటున్నార‌ని, ఇప్పుడే కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన‌ట్లు, సీఎం అయిన‌ట్లు భ్ర‌మ‌ల్లో ఉన్నార‌ని కాంగ్రెస్ నాయ‌కుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. రైతుబంధు ఆపాల‌ని కుట్ర‌లు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జ‌లు త‌గిన బుద్ది చెప్పుతార‌న్నారు. ఇవాళ(శుక్ర‌వారం) నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని బంగ‌ల్ పేట్ నుంచి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారానికి శ్రీకారం చుట్టారు. ప‌లు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ… ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు. వృద్దుల‌ను, మ‌హిళ‌ల‌ను అప్యాయంగా ప‌లుక‌రిస్తూ… అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌తో పాటు కేసీఆర్ మెనిపెస్టో ను వివ‌రిస్తూ… మ‌రోసారి కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వ‌దించాల‌ని అభ్య‌ర్థించారు.

రైతు వ్య‌తిరేఖ కాంగ్రెస్ పార్టీని అడుగ‌డుగునా నిల‌దీయాల‌ని కోరారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కాంగ్రెస్ మెనిపెస్టోను ప్ర‌జ‌లు నమ్మ‌ర‌ని స్ప‌ష్టం చేశారు. నిర్మ‌ల్ కాంగ్రెస్ స్థానిక అభ్య‌ర్థికి 15 ఏళ్ళుగా నియోజ‌క‌వ‌ర్గం గుర్తుకు రాలేద‌ని, ఇనేళ్ళు ఆయ‌న ఎక్క‌డ దాక్కున్నార‌ని ప్ర‌శ్నించారు. ఇక బీజేపీ కేవ‌లం మ‌తం ఆధారంగా ఓట్లు దండుకోవాల‌ని చేస్తోందని.. ప్ర‌జ‌లు బీజేపీని న‌మ్మె ప‌రిస్థితి లేద‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి.

ఇది కూడా చదవండి: రైతుబంధు ఎన్నికల కోసం కాదు

Latest News

More Articles