Monday, May 6, 2024

కాంగ్రెసోళ్లను నమ్మితే మోసపోతాం

spot_img

సంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ అంటే నయవంచన.. బీఆర్ఎస్ అంటే‌ ఒక నమ్మకం అని మంత్రి హరీష్ రావు అన్నారు. వట్ పల్లిలో నిర్వహించిన అలయ్ బలయ్ లో ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. అనాడు తెలంగాణ కోసం 11 రోజులు ఆమరణ దీక్ష చేసి కేసీఆర్ ఢిల్లీ‌మెడలు వంచాడని గుర్తుచేశారు. తెలంగాణను నిలబెట్టుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తుంటే.. ప్రతిక్షాలు ఆగం చేయాలని చూస్తున్నాయని విమర్శించారు.

Also Read.. కాంగ్రెస్ మెనిపెస్టోను ప్ర‌జ‌లు నమ్మ‌రు

కర్ణాటక పరిస్థితులను గమనిస్తే.. కాంగ్రెస్ పనితనం తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ అంటేనే ఝూటాకోర్ పార్టీ అని, 2009లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని తెలిపారు. కాంగ్రెసోళ్లను నమ్మితే మోసపోతాం. కేసీఆర్ పథకాలను కాంగ్రెస్ కాపీ‌కొడుతోంది.  ఎకరానికి 16000 రైతుబంధు, 5000 ఆసరా పెన్షన్లు దేశంలో ఎక్కడాలేని పథకాలు అమలు  చేస్తున్నామని తెలిపారు.

Also Read.. బీజేపీకి మరో షాక్.. జితేందర్ రెడ్డి ఔట్

రైతు‌చనిపోతే అప్లై చేయకపోయినా..రైతుభీమా ఇస్తున్నాం. కేసీఆర్ భీమా‌.. మన బతుకులకు భరోసా. ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములకు పట్టా సర్టీఫికేట్ ఇవ్వబోతున్నాం. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం దండగ చేస్తే.. కేసీఆర్ పండుగ జేసిండని పేర్కొన్నారు.  పల్లేరు మొలిచే నేలలో.. పసిడి సిరులు పండేలా చేసిండని కొనియాడారు.  కాంగ్రసోళ్లు సింగూర్ ను హైదరాబాద్ కు తరలిస్తే.. ఇప్పుడు ఆ నీళ్లను మీ‌ పంట పొలాలకు తీసుకొచ్చాం. కళ్లతో అభివృద్ధిని చూసి నమ్మి ఓటేయాలని మంత్రి హరీష్ రావు కోరారు.

Latest News

More Articles