Monday, May 13, 2024

అభిమాని కోసం ఆటో నడిపిన మంత్రి జగదీష్ రెడ్డి

spot_img

సూర్యాపేట: ఎన్నికల వేళ మాత్రమే కాదు.. సంక్షేమ పథకాలు పంచే వేళలో కూడా  ప్రజల పాత్రల్లోకి ఒదిగిపోవడమే ఆయన నైజం. నిత్యం ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ  ప్రజల మధ్య లో గడిపే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తన అభిమాని కోరిక మేరకు ఆటో నడిపి సందడి చేశారు. అదే ఆటో లో గృహలక్ష్మి లబ్ధిదారుడీ ఇంటికి వెళ్ళి నూతన గృహానికి శంకు స్థాపన చేసి సొంతింటి కలను నెరవేర్చారు.

ఇదికూడా చదవండి.. ఓటీటీ‎లోకి మెగాస్టార్ ‘భోళా శంకర్’

సూర్యాపేట నియోజకవర్గం లోని చివ్వెంల మండలం మున్యనాయక్ తండా లో గృహలక్ష్మి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయడంతో పాటు పలు గృహాలకు శంకుస్థాపన చేసెందుకు మంత్రి జగదీష్ రెడ్డి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న అయన అభిమాని బానోతు రవి నాయక్ తాను నూతనంగా  కొనుగోలు చేసిన ఆటోను తన అభిమాన నేత జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని కోరాడు.

ఇదికూడా చదవండి… ఫ్యూచర్, యంగ్ ఓటర్లకు పోటీలు. విజేతలకు 20వేలు..!!

వెంటనే అభిమాని కోరిక మేరకు ఆటో ను నడిపి ప్రారంభించిన మంత్రి.. అలానే కిలోమీటర్ వరకు నడుపుకుంటూ గృహలక్ష్మి లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి శంకుస్థాపన చేశారు. దీంతో అభిమాని ఆనందానికి అంతలేకుండా పోయింది. తన అభిమాని కోరిక తీరవడం కోసం సాదరణ మనిషిలా ఆటో నడపడం పట్ల ప్రజలు కూడ సంబ్రమాశ్చర్యాలకు గురయ్యారు.

Latest News

More Articles