మంత్రి కేటీఆర్ ముఖ్య అథిదిగా జరిగిన సూర్యాపేట ప్రగతి నివేదన సభ సూపర్ సక్సెస్ అయింది. ఈ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సూర్యాపేట నియోజకవర్గంలో రూ. 7,500 కోట్లతో అభివృద్ధి చేపట్టాం. భారత దేశంలో ఐటీ మంత్రి అంటే వినపడే పేరే కేటీఆర్. తెలంగాణలో కేటీఆర్ కారణంగానే పరిశ్రమలు తెలంగాణకి పోటెత్తుతున్నాయి.
పట్టణంలో 40 ఏళ్లుగా జరగని అభివృద్ధి ఈ 9ఏళ్ళల్లో చేసాం. ముఖ్యంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టి నల్గొండ జిల్లాని సుందరంగా అభివృద్ధి చేశాం. సీఎం కేసీఆర్ మంజూరు చేసిన స్పోర్ట్స్ స్కూల్ ని అతి త్వరలోనే ప్రారంభించుకుందాం. పుల్లారెడ్డి చెరువును ట్యాంక్ బండ్, జమ్మిగడ్ద వరకు రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేస్తే మరింత సుందరంగా సూర్యాపేట మారుతుంది’ అని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.