అనారోగ్యాల బారినపడి వైద్యం చేయించుకున్న పేదల పాలిట సీఎంఆర్ఎఫ్ వరంలా నిలుస్తోందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఇవాళ( సోమవారం) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో పెద్దపల్లి నియోజకవర్గంలోని 88 మంది లబ్ధిదారులకి సీఎం సహాయనిధి ద్వారా 33,74,388 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.
నిరుపేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ప్రభుత్వాసుపత్రాలను బలోపేతం చేసి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తుందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్ కిట్ పథకాన్ని సీఎం ప్రారంభించారన్నారు.