జింబాబ్వేలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన బిలినియర్, ఆయన తనయుడితో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. భారత్కు చెందిన హర్పాల్ సింగ్ రంధావా రియోజిమ్ పేరుతో మైనింగ్ కంపెనీని నిర్వహిస్తున్నారు. జింబాబ్వే రాజధాని హరారే నుంచి మురోవా వజ్రాల గనికి వెళ్తుండగా ప్రైవేట్ జెట్లో వెళ్తున్న సమయంలో మషావా ప్రాంతంలో విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన విమానాన్ని సెసెనా 206గా గుర్తించారు.