అమెరికాలో విషాదకర ఘటన జరిగింది. సౌత్ కరోలీనాలోని గ్రీన్విల్లె కౌంట్లో జరిగిన రోడ్డు ప్రమాదలో ముగ్గురు భారతీయ మహిళలు మరణించారు.అమెరికాలో మరణించిన ముగ్గురు భారతీయ మహిళల పేర్లు.. రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీషాబెన్ పటేల్. వీరందరు గుజరాత్కు చెందినవారు. మహిళలు ప్రయాణిస్తున్న ఎస్యూవీ.. వంతెనపైకి దూసుకువెళ్లింది. ఆ తర్వాత ఒక ఎత్తైన వస్తువు మీద నుంచి గాల్లోకి 20 అడుగుల పైకి ఎగిరింది. చివరికి.. వంతెన అపోజిట్ వైపు ఉన్న చెట్టును ఢీకొట్టి కిందపడిపోయింది. కారు మితిమీరిన వేగం మీద ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో వేరే వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని వివరించారు. మహిళలు ప్రయాణించిన కారు.. చెట్టులో ఇరుక్కుపోయిన స్థితిలో కనిపించింది. చాలా భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి.
కారులో ఒక డిటెక్షన్ సిస్టెమ్ ఉంది. కారు ప్రమాదానికి గురైన తర్వాత.. ఆ సిస్టెమ్ ద్వారా.. సంబంధిత మహిళల కుటుంబసభ్యులకు మెసేజ్ వెళ్లింది. వారు.. సౌత్ కరోలీనా అధికారులను అలర్ట్ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే.. ఎమర్జెన్సీ రెస్పాన్సీ టీమ్, సౌత్ కరోలీనా హైవే పాట్రోల్, ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్, ఈఎంఎస్ యూనిట్స్.. ఘటనా స్థలానికి వెళ్లాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఎస్యూవీలో నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది. ముగ్గురు మరణించగా.. నాలుగో వ్యక్తిని అధికారులు రక్షించి.. ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: కేటీఆర్పై వ్యాఖ్యలు: మంత్రి కొండా సురేఖకు ఎన్నికల సంఘం హెచ్చరిక