Thursday, May 9, 2024

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారత మహిళలు మృతి

spot_img

అమెరికాలో విషాదకర ఘటన జరిగింది. సౌత్​ కరోలీనాలోని గ్రీన్​విల్లె కౌంట్​లో జరిగిన రోడ్డు ప్రమాదలో ముగ్గురు భారతీయ మహిళలు మరణించారు.అమెరికాలో మరణించిన ముగ్గురు భారతీయ మహిళల పేర్లు.. రేఖాబెన్​ పటేల్​, సంగీతాబెన్​ పటేల్​, మనీషాబెన్​ పటేల్​. వీరందరు గుజరాత్​కు చెందినవారు. మహిళలు ప్రయాణిస్తున్న ఎస్​యూవీ.. వంతెనపైకి దూసుకువెళ్లింది. ఆ తర్వాత ఒక ఎత్తైన వస్తువు మీద నుంచి గాల్లోకి 20 అడుగుల పైకి ఎగిరింది. చివరికి.. వంతెన అపోజిట్​ వైపు ఉన్న చెట్టును ఢీకొట్టి కిందపడిపోయింది. కారు మితిమీరిన వేగం  మీద ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో వేరే వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని వివరించారు. మహిళలు ప్రయాణించిన కారు.. చెట్టులో ఇరుక్కుపోయిన స్థితిలో కనిపించింది. చాలా భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి.

కారులో ఒక డిటెక్షన్​ సిస్టెమ్​ ఉంది. కారు ప్రమాదానికి గురైన తర్వాత.. ఆ సిస్టెమ్​ ద్వారా.. సంబంధిత మహిళల కుటుంబసభ్యులకు మెసేజ్​ వెళ్లింది. వారు.. సౌత్​ కరోలీనా అధికారులను అలర్ట్​ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే.. ఎమర్జెన్సీ రెస్పాన్సీ టీమ్​, సౌత్​ కరోలీనా హైవే పాట్రోల్​, ఫైర్​ అండ్​ రెస్క్యూ టీమ్​, ఈఎంఎస్​ యూనిట్స్​.. ఘటనా స్థలానికి వెళ్లాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఎస్​యూవీలో నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది. ముగ్గురు మరణించగా.. నాలుగో వ్యక్తిని అధికారులు రక్షించి.. ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: కేటీఆర్‌పై వ్యాఖ్యలు: మంత్రి కొండా సురేఖకు ఎన్నికల సంఘం హెచ్చరిక

Latest News

More Articles