Thursday, May 9, 2024

10,12వ తరగతికి ఏటా రెండు సార్లు సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు

spot_img

వచ్చే ఏడాది నుంచి రెండు సార్లు టెన్త్, ఇంటర్ సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు నిర్వహించే దిశగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే, సెమిస్టర్ విధానాన్ని మాత్రం ప్రారంభించే ఆలోచన లేదని తెలుస్తోంది. ఈ విషయమై పాఠశాలల ప్రిన్సిపాళ్లతో వచ్చే నెలలో చర్చలు కూడా జరిపేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లపై ప్రభావం లేకుండా పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది.

కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ  విద్యావిధానానికి అనుగుణంగా సీబీఎస్‌ఈ పరీక్షల్లో మార్పులు చేయాలని నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ ముసాయిదా కమిటీ గతంలో సూచించింది. ఇస్రో మాజీ చైర్మన్ కె. కస్తూరీ రంగన్ సారథ్యంలోని ఈ కమిటీ 11, 12వ తరగతి విద్యార్థులకు సెమిస్టర్ విధానాన్ని వర్తించాలని ప్రతిపాదించింది.

సీబీఎస్‌ఈ విద్యార్థులు రెండు సార్లు  పరీక్షకు హాజరుకావడం తప్పనిసరేమీ కాదని అన్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి. ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్ష జేఈఈ మాదిరిగానే స్టూడెంట్స్‌ ఏడాదికి రెండు సార్లు పది, పన్నెండవ తరగతుల పరీక్షలు రాసే అవకాశం ఉంటుందన్నారు. పరీక్షలకు హాజరవడం ఆప్షనల్ అని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: యూపీ యూనివర్సిటీలో కొత్త స్కామ్: పరీక్షల్లో ‘జై శ్రీరామ్’ అని రాసిన వాళ్లకు మార్క్స్

Latest News

More Articles