Monday, May 20, 2024

తెలంగాణలో రెండు రోజులు మద్యం షాపులు బంద్

spot_img

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులను బంద్ చేయనున్నారు. ఎలక్షన్ సమయంలో ఎలాంటి ఘర్ణణలకు అవకాశం లేకుండా..ప్ర‌శాంతమైన వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌లు జ‌రిగేలా ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 48 గంట‌ల పాటు డ్రై డ్రేగా ప్ర‌క‌టించింది.

ఈ నెల 11న (శనివారం) సాయంత్రం 6 గంటల నుంచి మే 13న (సోమ‌వారం) సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ షాపులను బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. వైన్ షాపుల‌తో పాటు క‌ల్లు కాంపౌండ్‌లు కూడా మూసివేయనున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాల రోజు జూన్ 4వ తేదీన కూడా వైన్ షాపులు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి:బీజేపీకి ఓటేస్తే సిలిండ‌ర్ ధ‌ర రూ. 5 వేలు అయిత‌ది

Latest News

More Articles