ఐపీఎస్ అధికారిగా ఎన్నో అద్భుతాలు సృష్టించిన వ్యక్తి నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ ప్రశంసలు కురిపించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ(బుధవారం) కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని హైదరాబాద్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మద్దతుగా మాట్లాడారు.
1000 గురుకులాలను కేసీఆర్ ప్రారంభిస్తే.. వాటిని సమర్థవంతంగా నడిపిన మొనగాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని తెలిపారు కేటాఆర్. ఇలాంటి అభ్యర్థి నాగర్కర్నూల్కు మళ్లీ దొరకడని.. ఆయన పార్లమెంట్లో అడుగు పెడితే మన గౌరవం పెరుగుతుందన్నారు. రాజకీయ నాయకులు చాలా మందే ఉంటారు. పైసలు ఉన్నోళ్లు రాజకీయాల్లోకి వస్తుంటారు. పేద కుటుంబం నుంచి కష్టపడి చదువుకుని ఐపీఎస్ అయిన వ్యక్తి ప్రవీణ్ కుమార్. ఐపీఎస్ ఆఫసీర్గా 8 ఏండ్ల సర్వీసును కూడా వదిలిపెట్టి ప్రజా సేవం కోసం రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ ఓడిపోయినా మన కోసం పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో బంపరాఫర్లు ఆర్ఎస్పీకి ఇచ్చిందన్నారు. ఎంపీ చేస్తాం, టీఎస్పీఎస్సీ చైర్మన్ చేస్తాం. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిని చేస్తామని ఆశ పెట్టినా అలాంటివేమీ పట్టించుకోకుండా మనం కోసం బీఆర్ఎస్లోకి వచ్చారు అని కేటీఆర్ తెలిపారు.
గతంలో కల్వకుర్తిలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే మీ మనస్సుల్లోంచి తీసేయండి. ఇవాళ అద్భుతమైన అభ్యర్థి వచ్చిండు. కలిసొచ్చే కాలకానికి నడిచొచ్చే కొడుకు వచ్చిండన్నట్టు ఆర్ఎస్పీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. పొరపాటున కూడా కాంగ్రెస్కు ఓటేస్తే.. రేవంత్ రెడ్డి ఒకటే అంటడు. రుణమాఫీ చేయకున్నా.. రూ. 2,500 ఇవ్వకున్నా, రూ. 4 వేల పెన్షన్ ఇవ్వకున్నా, స్కూటీలు ఇవ్వకున్నా నాకే ఓటేశారని అంటాడని చెప్పారు. అంతేకాదు ఇంకా వాళ్లకు ఏ పథకం అమలు చేయకున్న సరిపోతది అని రేవంత్ ఏ పథకం అమలు చేయడని అన్నారు.
ఇది కూడా చదవండి:బీజేపీకి ఓటేస్తే సిలిండర్ ధర రూ. 5 వేలు అయితది