ఏపీలోని పల్నాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాచర్లలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఇరు వర్గాలు పరస్పర రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రుష్ణారెడ్డి భార్య రమాదేవితోపాటు మరికొందరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. శిరిగిరిపాడులో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామక్రుష్ణారెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీచరాజకీయాలకు తెరలేపుతున్నారంటూ ఆగ్రహంవ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న మాచర్ల నియోజకవర్గంలో జూలకంటి బ్రహ్మారెడ్డి వల్లే దాడులు జరుగుతున్నాయంటూ రమాదేవి ఆరోపించారు.
ప్రస్టేషన్తో శాడిస్ట్ల్లా మారుతున్న టీడీపీ నేతలు!
ఎన్నికల ప్రచారంలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి భార్య రమాపై టీడీపీ గూండాలు దాడి
నియోజకవర్గంలో గత కొన్నిరోజులుగా గూండాలను దాడులకి ఉసిగొల్పుతున్న టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి
ఓటమి భయంతో… pic.twitter.com/2nj16zAQUx
— YSR Congress Party (@YSRCParty) May 8, 2024
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కు ఓటు వేస్తే అది కచ్చితంగా బీజేపీకి ఓటు వేసినట్లే