Monday, May 20, 2024

కాంగ్రెస్ కు ఓటు వేస్తే అది కచ్చితంగా బీజేపీకి ఓటు వేసినట్లే

spot_img

కాంగ్రెస్ కు ఓటు వేస్తే అది కచ్చితంగా బీజేపీకి ఓటు వేసినట్లేనని తెలిపారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.ఓటు వేసే ముందు ఒక్కసారి కచ్చితంగా ఆలోచించాలె. ఎవరికి ఓటు వేస్తే మనకు ప్రయోజనం అవుతుందో తెలుసుకోవాలన్నారు. ఇవాళ(బుధవారం) మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని కుషాయి గూడలో మైనార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు కేటీఆర్.10 క్రితం బడేభాయ్ మోడీ ఎన్నో హామీలు ఇచ్చిండు. రూ. 15 లక్షలు అన్నాడు. ఎవరి అకౌంట్లోనైనా పైసలు పడ్డాయా?. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం డబుల్, ప్రతి ఒక్కరికి ఇళ్లు, ప్రతి ఇంటికి నల్లా, బుల్లెట్ ట్రైన్ అని చాలా చెప్పిండు.ఒక్క హామీ అయినా అమలు అయ్యిందా? ఏమీ చేయలేదు. మోడీ చేస్తోంది ఒక్కటే మనుషుల మనసులో విషం నింపి రాజకీయాలు చేస్తుండు.ముస్లింలకు, పేదలకు ఏమీ చేశావని ప్రధానిని అడిగితే చెప్పుకోవటానికి ఒక్క పని కూడా లేదు.కేసీఆర్ హిందువు. ఆయన ధర్మాన్ని పాటించారు. కానీ రాజకీయాల్లో మతాన్ని వాడుకోలేదు.రంజాన్ తోఫా మీకు వచ్చిందా? మహిళలకు రూ. 2500 వచ్చాయా?.కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు నమ్మటంతో ప్రజలు మనల్ని ఓడించారు. పర్వాలేదు. హైదరాబాద్ లో మీరు నమ్మలేదు. ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు ఇవ్వలేదు. కానీ గత పదేళ్లలో నీళ్లు, కరెంట్ కష్టాలు ఉండేనా? ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ వచ్చిన నాలుగున్నర నెలల్లోనే కరెంట్, నీళ్ల కష్టాలు మొదలయ్యాయన్నారు.

హిందూ, ముస్లిం అని ఎప్పుడు కేసీఆర్ చూడలేదు. మనిషిని మనిషిగా చూసి వారి కోసం పని చేశారని తెలిపారు కేటీఆర్. కేసీఆర్ పాలనలో మత సామరస్యాన్ని కాపాడారు. ఒక్కసారి కర్ఫ్యూ పెట్టాల్సిన అవసరం రాలేదు. మతం పేరుతో కేసీఆర్ ఎప్పుడు రాజకీయాలు చేయలేదన్నారు.204 మైనార్టీ స్కూల్ పెట్టారు. వందకు పైగా మైనార్టీ మహిళల కోసం స్కూల్ పెట్టారు.ఒక్కో విద్యార్థి పై ఏటా లక్షా 20 వేల రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు.ఎందుకంటే పేద విద్యార్థులు కూడా ప్రపంచంతో పోటీ పడాలని ఆయన భావించారని అని అన్నారు.మైనార్టీ ల కోసం 204 స్కూల్ పెట్టిన రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు.కాంగ్రెస్ కు గతంలో ఎన్నో ఏళ్లు మీరు అవకాశం ఇచ్చారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎందుకు ఇంకా ముస్లింలు పేదరికంలోనే ఉన్నారని అడిగారు కేటార్.

కాంగ్రెస్ ను మీరు నమ్మి ఓటు వేసినప్పుడల్లా…ఆ పార్టీ మిమ్మల్ని మోసం చేసింది. ఉత్తర ప్రదేశ్ లో 4 కోట్ల ముస్లింలు ఉంటే 1600 కోట్లు మాత్రమే ముస్లింలకు కోసం బడ్జెట్ పెట్టింది. బెంగాల్ దాదాపు రెండు కోట్లకు పైగా ముస్లింలు ఉంటే అక్కడ 2 వేల కోట్లు బడ్జెట్ పెట్టారు.మహారాష్ట్రలో కోటిన్నర ముస్లింలు ఉంటే  670 కోట్లు, కర్ణాటకలో 80 లక్షల ముస్లింలు ఉంటే  2 వేల కోట్లు మాత్రమే బడ్జెట్ పెట్టిందన్నారు. అదే తెలంగాణలో మాత్రం 50 లక్షల ముస్లింలు ఉంటే 2 వేల 2 వందల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిందన్నారు. మైనార్టీలు, పేదలు సంక్షేమం కోసం నిజాయితీగా పనిచేసింది కేసీఆర్ మాత్రమే అని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది కాంగ్రెస్.50 రోజులుగా మా చెల్లెలు, కేసీఆర్ కూతురు జైల్లో ఉంది. నిజంగా బీజేపీ తో మాకు ఏదైనా దోస్తీ ఉంటే మా చెల్లెలు జైల్లో ఉండేదా?.మోడీ విధానం అయితే జైల్లో ఉండాలే.. లేదంటే జేబులో ఉండాలే. అందుకు ఒప్పుకోనందుకే కవిత, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ ను జైల్లో పెట్టారు. 2014, 2018 బీజేపీ ని ఓడించిందే బీఆర్ఎస్.2023 లో కూడా బీజేపీ తీస్ మార్ ఖాన్ లని భావించేవాళ్లందరినీ బీఆర్ఎస్సే ఓడించింది. పదేళ్ల లో మేము చేసిన పని మీ ముందు ఉంది. అందుకే తొందరపడి ఆగం కావద్దని కోరారు కేటీఆర్.

కాంగ్రెస్ కు ఓటు వేస్తే అది కచ్చితంగా బీజేపీకే మేలు జరుగుతుందన్నారు కేటీఆర్. అమేథీ లో బీజేపీ తో పోటీ పడేందుకు రాహుల్ గాంధీ భయపడుతున్నారన్నారు. అలాంటి వ్యక్తి దేశంలో బీజేపీని ఎదుర్కొగలడా? ఒక్కసారి ఆలోచించండి అని ప్రశ్నించారు. పదేళ్లలో బీజేపీ.. దేశంలోని కేసీఆర్, మమతా బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్ లాంటి నాయకుల ప్రభుత్వాలను పడగొట్టాలని చూసి విఫలమైంది. అదే కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలలో మాత్రం అక్కడి ప్రభుత్వాలను సులభంగా పడగొట్టింది.అంటే బీజేపీని ఎదుర్కొనే శక్తి ప్రాంతీయ పార్టీల నాయకులకే ఉంది. కాంగ్రెస్ కు మాత్రం లేదన్నారు.బీజేపీకి మేలు చేసేందుకే ఇక్కడ కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని పోటీలో పెట్టిందన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ బాగుండే అని మీకు అనిపిస్తోందా? అని అడిగారు కేటీఆర్.అయితే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. 13 తారీఖు నాడు బీఆర్ఎస్ కు ఓటు వేయండి. మీరు 10-12 సీట్లు ఇస్తే చాలు. మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారన్నారు.

ఈటల రాజేందర్, సునీత మహేందర్ రెడ్డి నాన్ లోకల్. ఎన్నికలు అయిపోగానే వాళ్లు ఇక్కడ ఉండరని తెలిపారు కేటీఆర్. రాగిడి లక్ష్మారెడ్డి కి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి:చివ‌రి ద‌శ ఎన్నిక‌ల‌కు నోటిపికేష‌న్… నేటి నుంచి నామినేష‌న్ లు స్వీక‌ర‌ణ

Latest News

More Articles