Monday, May 20, 2024

కాలు మీద కాలేసుకుని కూర్చుంటున్నారా..?ప్రమాదంలో పడ్డట్లే.!

spot_img

మనలో చాలా మందికి కాలు మీద కాలు వేసుకుని కూర్చునే అలవాటు ఉంటుంది. కొందరు కూర్చీలో కూర్చుండి కాలుమీద కాలు వేసుకుంటారు. డెస్క్ వర్క్ చేసేవారు ఎక్కువగా ఈ పొజిషన్స్ లో కూర్చుకుంటారు. అయితే ఈ పొజిషన్ లో ఎక్కువసేపు కూర్చుంటే ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాలుమీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల పెల్విక్ ప్రాంతంలో ఎముకల అమరికలో సమస్యను పెంచుతుందట. కాళ్లకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. వెన్నుముక అమరిక దెబ్బతిని లోయర్ బ్యాక్ పెయిన్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాలు మీద కాలు ఎక్కువసేపు వేసుకుని కూర్చుంటే ఆరోగ్యం ఎలా ప్రభావితం అవుతుందో తెలుసుకుందాం.

అధిక రక్తపోటు :
బీపీ చెక్ చేసుకునే సమయంలో కుర్చిలో కూర్చుని రెండు పాదాలు నేలపై ఉంచాలి. దీంతో రక్తప్రసరణ మెరుగవుతుంది. అయితే కాలు మీద కాలు వేసుకుని కూర్చుకుంటే రక్తపోటు తాత్కాలికంగా మెరుగుపడుతుందని పరిశోధనల్లో వెల్లడయ్యింది. జర్నల్ ఆఫ్ క్లినికల్ నర్సింగ్ లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం..కూర్చునేటప్పుడు మోకాలిస్థాయి కంటే ఎక్కువ ఎత్తు కాలు ఉంటే రక్తపోటు పెరుగుతుంది. జర్నల్ ఆఫ్ హైపర్ టెన్షన్ అధ్యయనం ప్రకారం..మోకాళ్లపై చీలమండలను ఉంచితే రక్తపోటు కొద్దిగా పెరుగుతుంది.

సిరలు దెబ్బతినడం:
సిరల ద్వాా రక్త ప్రవాహం సులభంగా గుండెకు చేరుకున్నప్పుడు లేదా పంపింగ్ జరుగుతున్న రక్తప్రసరణలో సమస్య ఏర్పడితే రక్తం తిరిగి సిరల్లో ప్రవహిస్తుంది. ఇది సిరల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వీటిలో రక్తం గడ్డకట్టి శరీరంలోని అనేక భాగాలపై సిరలు ఉబ్బినట్లు కనిపిస్తాయి. కాలుమీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల వెరికోస్ వెయిన్స్ సమస్య వస్తుంది.

తొడల్లో బరువు పెరుగుతుంది:
కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తొడల భాగంలో బరువు పెరుగుతుంది. కాళ్లు ఉబ్బడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. కొన్ని సందర్బాల్లో శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగక..నడవలేని పరిస్థితికి దారితీస్తుంది. ఎక్కువ సమయం కాలుమీద కాలు వేసుకుని కూర్చుంటే వెన్నునొప్పి, మోకాలి నొప్పి, పాదాలలో తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి.

గర్భిణులకు మంచిదికాదు:
గర్బిణీలు కాలుమీద కాలు వేసుకుని కూర్చోవడం వారికి ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ పొజిషన్ అనేక సమస్యలకు కారణం అవుతుంది. గర్భదారణ సమయంలో మహిళల శరీరాలు వేగంగా మార్పుతుంటాయి. కండరాల తిమ్మిరి వెన్ను నొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. గర్బిణీలు కాలుమీద కాలు వేసుకుంటే తల్లితోపాటు బిడ్డకు హాని కలుగుతుంది. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల సమస్యలకు దారి తీస్తుంది.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కు ఓటు వేస్తే అది కచ్చితంగా బీజేపీకి ఓటు వేసినట్లే

Latest News

More Articles