Monday, May 20, 2024

నడ్డా, అమిత్ మాల్వీయకు బెంగళూరు పోలీసుల సమన్లు

spot_img

బీజెపి జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా, బీజేపీ ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వీయకు బెంగళూరు పోలీసులు సమన్లు జారీ చేశారు. ముస్లింలను, కాంగ్రెస్ పార్టీని లక్షంగా చేసుకుని బీజేపీ కర్ణాటక ఎక్స్ హ్యాండిల్‌లో పోస్టు చేసిన అభ్యంతరకర ట్వీట్‌కు సంబంధించి నడ్డా అమిత్ మాల్వీయకు పోలీసులు ఇవాళ(బుధవారం) సమన్లు జారీచేశారు. అంతేకాదు 7 రోజుల్లో బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీసు స్టేషన్‌లో హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు.

బీజేపీ నాయకులపై సమన్లు జారీ చేయడంపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర్.. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తప్పవన్నారు. ఒకసారి నడ్డా, మాల్వీయ వచ్చి తమ వాంగ్మూలాన్ని ఇచ్చి, తమ ప్రకటనను సమర్థించుకుంటే తదుపరి చర్యల గురించి పరిశీలిస్తామన్నారు.

బీజేపీ కర్ణాటక విభాగం షేర్ చేసిన పోస్టును వెంటనే తొలగించాలంటూ ఎక్స్ ను ఎన్నికల కమిషన్ ఆదేశించిన మరుసటి రోజే నడ్డా, మాల్వీయ కు నోటీసులు జారీ అయ్యాయి. రిజర్వేషన్ రాజకీయాలలో ముస్లింల పట్ల కాంగ్రెస్ అనుకూలంగా వ్యవహరిస్తోందని తెలియ చేసే ఒక వీడియోను ఎక్స్ లో పోస్టు చేసినందుకు కర్నాటక బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్రపై ఇప్పటికే కర్ణాటక పోలీసులు ఒక ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, సీఎం సిద్దరామయ్య ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కన్నా ఎక్కువ నిధులను ముస్లింలకు ఇస్తున్నట్లు చూపించే ఓ వీడియోను బీజేపీ కర్ణాటక శాఖ ఎక్స్ లో పోస్టు చేసింది.

ఇది కూడా చదవండి:వినోద్ కుమార్‌ను గెలిపించండి: ఎక్స్ లో కేటీఆర్ వీడియో

Latest News

More Articles