ప్రజలకోసం, ప్రజల తరపున పోరాటం చేయగల దమ్మున్న నాయకుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ను ఆశీర్వదించాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్లకు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి ఓ వీడియోను ఎక్స్ లో షేర్ చేశారు.
ఇది కూడా చదవండి:ఐదు నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
బోయిన్పల్లి వినోద్ కుమార్ 24 ఏండ్లుగా కేసీఆర్తో నడుస్తున్నారు. ఒక తమ్ముడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించిన నాయకుడు. మళ్లీ ఈ రోజు కూడా తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తున్న నాయకుడు వినోద్ కుమార్. అలాంటి నాయకుడి గొంతు మనం పార్లమెంట్లో వినాలి. కేసీఆర్ సూచనతో కరీంనగర్కు రైలును తీసుకొచ్చేందుకు కృషి చేశారు. చదుకున్న వ్యక్తి, విద్యావంతుడు, న్యాయవాది. ప్రజల తరపున గొంతెత్తి మాట్లాడే దమ్మున్న నాయకుడు. వినోద్ కుమార్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరుతూ వీడియోను సోషల్ మీడియలో షేర్ చేశారు కేటీఆర్.
తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో ముందు ఉండి నడిచిన నాయకుడు…ఎంపీగా కరీంనగర్కు స్మార్ట్ సిటీని సాధించిన దమ్మున్న లీడర్ బోయినపల్లి వినోద్ కుమార్ గారు.
పార్లమెంటులో మన గొంతు వినిపించేందుకు కారు గుర్తుకు వోటు వేద్దాం.#BoianapalliVinodKumar #ParliamentElection2024 pic.twitter.com/OQB7kwn3xs
— B Vinod Kumar (@vinodboianpalli) May 8, 2024