Monday, May 20, 2024

రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లని చెక్కు లాంటిది

spot_img

పార్లమెంట్ ఎన్నికల్లో పొటీ కాంగ్రెస్,బీజేపీ పార్టీల మధ్యనే వుంటుందని ప్రచారాలు చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి.కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారాయన్నారు.సర్వే రిపోర్ట్స్ చూస్తే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి దిమ్మతిరగటం ఖాయన్నారు. ఇవాళ(బుధవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ మాట్లాడారు శ్రీధర్ రెడ్డి. వాగ్ధానాల వరద,నోటి దురద,అబద్దాల బురద తప్ప రేవంత్ రెడ్డి దగ్గర ఏం లేదు. రేవంత్ రెడ్డి దేవుళ్ళపై ఎందుకు ప్రమాణాలు చేస్తున్నారో చెప్పాలి. కేసీఆర్ భయంతోనే రైతు బంధును మళ్లీ మొదలుపెట్టారు. రైతు బంధును ఎన్నికల కమీషన్ ఆపమని చెప్పింది.రైతు బంధు విషయంలో పొన్నం ప్రభాకర్,కోమటిరెడ్డి మాటలు నిజమా భట్టి మాటలు నిజమా.రైతు బంధు విషయంలో బీఆర్ఎస్ ఎక్కడా ఫిర్యాదులు చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉద్దేశపూర్వకంగా రైతు బంధును కాంగ్రెస్ పార్టీ ఆపింది. రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పని చేసింది. ఎన్నడూ కేసీఆర్ సర్కార్ రైతు బంధును ఆపలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు బీఆర్ఎస్ వైపు వుంటారు.రాష్ట్రంలో మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పడం విడ్డూరం. ఆరు గ్యారెంటీలు,13 హామీలు పార్లమెంట్ ఎన్నికలకు 23 అంశాలపై కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభద్రతాభావంలో వుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లని చెక్కు లాంటిదన్నారు.

కేసీఆర్ రోడ్ షోలకు ప్రజలు ప్రభంజనంలా తరలి వస్తున్నారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్ సభలకు జనం రావడం లేదని తెలిపారు రావుల శ్రీధర్ రెడ్డి. పదేండ్లలో విభజన హామీలు నెరవేర్చారో లేదో చెప్పి బీజేపీ ఓట్లు అడగాలన్నారు. తెలంగాణకు బీజేపీ చేసింది ఏం లేదు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చెస్తే కేంద్రంలో అధికారంలో ఉండి బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణకు ఏం చేశారని బీజేపీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ నగరంలో కేంద్ర ప్రభుత్వం కట్టే రెండు ఫ్లైఓవర్లు అసంపూర్తిగా వున్నాయని తెలిపారు. కేటీఆర్ ఆధ్వర్యంలో 37 ఫ్లైఓవర్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందన్నారు. నిజామాబాద్ కు పసుపు బోర్డు తెస్తానని అరవింద్ మోసం చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్,బీజేపీ పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని చూస్తున్నాయన్నారు. పార్లమెంటులో తెలంగాణ గొంతుక బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే క్యాడర్ ఉందన్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం ఖాయమన్నారు రావుల.

ఇది కూడా చదవండి:వినోద్ కుమార్‌ను గెలిపించండి: ఎక్స్ లో కేటీఆర్ వీడియో

Latest News

More Articles