Friday, May 3, 2024

అకాల వర్షాలపై.. మంత్రి జగదీశ్ రెడ్డి సమీక్షా..!

spot_img

అకాల వర్షాలతో విద్యుత్ శాఖకు సంభవించిన నష్టాలపై డా.అంబేద్కర్ సచివాలయంలోని తన ఛాంబర్ లో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, ట్రాన్స్ కో,జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, టీఎస్ఎస్పీడిసిఎల్ సీఎండీ రఘుమా రెడ్డిలు హాజరయ్యారు.

వేసవికాలంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉండడంతో విద్యుత్ శాఖ ఇంజనీర్స్, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఈదురు గాలులతో చెట్లు విరిగి స్తంభాలపై పడడంతో వైర్లు తెగిపడడం వంటి వాటిపై క్షేత్ర స్థాయిలో సిబ్బంది పర్యవేక్షణ చేయాలని, అందరు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని కోరారు మంత్రి జగదీశ్ రెడ్డి.

Latest News

More Articles