Tuesday, May 21, 2024

గెలుపు కోసమే అసత్య ప్రచారాలు చేస్తున్నారు

spot_img

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించడం రేవంత్ రెడ్డి అజ్ఞానానికి నిదర్శనమన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఎన్నికల్లో గెలుపు కోసమే అసత్య ప్రచారాలు చేస్తున్నాడన్నారు. ధర్మపురిలో మీడియా సమావేశంలో మాట్లాడారు కొప్పుల. నిన్న ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018 ఎన్నికపై ఈవీఎంల ట్యాంపరింగ్ చేసాను అన్న రేవంత్ రెడ్డి మాటలు.. ఎన్నికల కమిషన్ కించపరచడమే అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లనే తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని తెలిపారు.

మరోవైపు జీవన్ రెడ్డి హయాంలో జగిత్యాల అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. మళ్లీ గెలవడం కోసం బూటకపు ఆరోపణలు చేయడం తగదని తెలిపారు. కేవలం గెలుపు కోసమే జీవన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నాడని.. రాజకీయాలు, పదవులు శాశ్వతం కాదన్నారు. అంతిమంగా ఎవరు ఏమిటో ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయన్నారు మంత్రి కొప్పుల.

ఇది కూడా చదవండి: రేవంత్‌రెడ్డికి రైతులు బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా..?

Latest News

More Articles